వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై చీటింగ్ కేసు!

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై చీటింగ్ కేసు!

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. రాజధాని విషయంలో నమ్మించి మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతి ఉంటుందని ఆళ్ల చేసిన ప్రకటనను ఫిర్యాదుకు జతచేసిన రైతులు.. పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పినందుకు ఆర్కేపై చీటింగ్ కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story