కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్యకు కరోనా పాజిటివ్

X
By - TV5 Telugu |4 Aug 2020 5:50 PM IST
కర్ణాటకలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజు వేల సంఖ్యలో మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు. తాజాగా మాజీ సీఎం సిద్ధ రామయ్యకు వైరస్ పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. వైద్యుల సూచన మేరకు హాస్పిటల్లో చేరానన్నారు. ఇటీవల తనను కలిసిన వారు లక్షణాలుంటే క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,39,571 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 74,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 62,500 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 2,594 మంది వైరస్ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com