భారత్ లో 66.31 శాతానికి చేరిన రికవరీ రేటు

24 గంటల్లో దేశంలో 6.6 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపింది. ఇప్పటివరకు 2 కోట్లకు పైగా ప్రజలు పరీక్షించబడ్డారు. కోలుకుంటున్న రోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు మొదటి లాక్డౌన్ తరువాత మరణాల రేటు అతి తక్కువ అని.. దేశంలో మరణాల రేటు ఇప్పుడు 2.10% మాత్రమే ఉందని.. మరణాలలో గణనీయమైన క్షీణత ఉందని అన్నారు. ఇది నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు.
అనేక రాష్ట్రాలు వారి పరీక్ష సామర్థ్యాన్ని పెంచాయి. వీటిలో RT-PCR ,వేగవంతమైన యాంటిజెన్ పరీక్షలు కూడా ఉన్నాయి. ప్రతి 10 లక్షల జనాభాకు 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతిరోజూ 140 కి పైగా పరీక్షలు జరుగుతున్నాయని.. గోవా, ఢిల్లీ, త్రిపుర మరియు తమిళనాడు రాష్ట్రాలు పరీక్ష సామర్థ్యాన్ని మరింత పెంచాయని చెప్పారు. ఇక రికవరీ రేటు 66.31 కాగా, కరోనా పాజిటివిటీ రేటు 11 శాతంగా నమోదైందని తెలిపారు. ఇక కరోనా మరణాల్లో 50 శాతం 60 ఏళ్ల వయసుపైబడిన వారు కాగా, 45-60 ఏళ్లలోపు వారు 37 శాతం ఉన్నారని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com