ఏపీలో కొత్తగా 9,747 మందికి కరోనా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో
64,147 మందికి పరీక్షలు చేయగా.. మొత్తం 9,747 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. అలాగే
కోవిడ్ వల్ల గుంటూరు లో పన్నెండు మంది, కృష్ణ లో తొమ్మిది మంది, కర్నూల్ లో
ఎనిమిది మంది, చిత్తూర్ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఏడుగురు, నెల్లూరు లో
ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, విశాఖపట్నం లో
ఇద్దరు,
ప్రకాశం లో ఒక్కరు, విజయనగరం లో ఒక్కరు, పశ్చిమ గోదావరి లోమరొకరు మరణించారు. గడచిన 24 గంటల్లో 6,953 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,73,438 పాజిటివ్ కేసులకు గాను 92,730 మంది డిశ్చార్జ్ కాగా.. 1,604 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 79,104 గా ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com