వూహాన్ లోనే కరోనా అంతం..: ట్రంప్

ప్రాణాంతక వైరస్ ప్రపంచం మొత్తాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. తమ దేశాన్ని అతలాకుతలం చేసిన తర్వాత చైనాపై తమ వైఖరి పూర్తిగా మారిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ మహమ్మారిని వూహాన్ లోనే అంతం చేయాల్సిందని, అలా చేసి ఉంటే ఈ రోజు ప్రపంచం ఈ విధంగా బాధపడి ఉండేది కాదని అన్నారు. బుధవారం వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో 70 శాతం కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మరింత కఠిన చర్యలు అవలంభిస్తామని అన్నారు. నిజానికి చైనా వైరస్ ను వూహాన్ లోనే ఆపాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించుకునేందుకు అన్ని చర్యలు అవలంభిస్తున్నామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com