కొవిడ్ ఎఫెక్ట్.. కస్టమర్ల కోసం బ్యాంకులు బంగారంపై..
![కొవిడ్ ఎఫెక్ట్.. కస్టమర్ల కోసం బ్యాంకులు బంగారంపై.. కొవిడ్ ఎఫెక్ట్.. కస్టమర్ల కోసం బ్యాంకులు బంగారంపై..](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/08/banks.png)
కొవిడ్ కష్టకాలంలో కస్టమర్లకు ఆసరాగా నిలిచేందుకు బంగారం విలువపై బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ఇచ్చే రుణ మొత్తాన్ని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సడలింపు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు బంగారు ఆభరణాల తనఖాపై ఇచ్చే వ్యవసాయేతర రుణాలకు బంగారం విలువలో 75 శాతం మించకుండా రుణాలు జారీ చేస్తున్నాయి.
కరోనా కుటుంబ ఆదాయాలపై పెను ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ తరహా రుణాలకు రుణ విలువని 90 శాతం వరకు పెంచాలని నిర్ణయించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. గోల్డ్ లోన్ లు జారీ చేసే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఈ నిర్ణయం సానుకూల పరిణామమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారంపై తనఖాపై 4.5 లక్షల రూపాయల వరకు రుణం పొందొచ్చు. అయితే అదే స్థాయిలో వడ్డీ భారం కూడా ఉంటుందనేది గమనించవలసిన విషయం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com