నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుల ఆందోళన

X
By - TV5 Telugu |9 Aug 2020 4:27 AM IST
నెల్లూరు జిల్లాలో కరోనా బాధితులు రోడ్డెక్కారు. మూడు రోజులుగా భోజనం, మందులు ఇవ్వడం లేదంటూ గూడూరు లోని గాంధీనగర్ రోడ్డులో బైఠాయించారు. క్వారంటైన్ సెంటర్ లో వైద్యులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సెంటర్ నుంచి తమను ఇంటికి పంపాలి అంటూ నినాదాలు చేశారు.
కాగా ఏపీలో కరోనా టెర్రర్ పుట్టిస్తోంది. గత 24 గంటల్లో 62,123 శాంపిల్స్ ను పరీక్షించగా 10,080 మందికి కోవిద్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,14,145 పాజిటివ్ కేసులకు గాను.. 1,26,720 మంది డిశ్చార్జ్ కాగా..1,939 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,486 గా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com