కరోనా : ఏపీలో మరో 9,097 మంది డిశ్చార్జ్..

కరోనా : ఏపీలో మరో 9,097 మంది డిశ్చార్జ్..

ఏపీలో మరోసారి కరోనా కేసులు పదివేలు దాటాయి. గత 24 గంటల్లో 62,912 శాంపిల్స్ ను పరీక్షించగా 10,820 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. ఇక కరోనా కారణంగా గుంటూరు లో పన్నెండు మంది, ప్రకాశం లో పదకొండు మంది, చిత్తూర్‌ లో పది మంది, పశ్చిమ గోదావరి లో పది మంది, అనంతపూర్‌ లో ఎనిమిది మంది, కడప లో ఎనిమిది మంది, శ్రీకాకుళం లో ఎనిమిది మంది, కర్నూల్‌ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, కృష్ణ లో

నలుగురు, నెల్లూరు లో నలుగురు , విజయనగరం లో ముగ్గురు మరణించారు. మరోవైపు గడచిన 24 గంటల్లో 9,097 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,24,965 పాజిటివ్ కేసు లకు గాను 1,35,817 మంది డిశ్చార్జ్ కాగా.. 2,036 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 87,112 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story