పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఆరో విడత నిధులు విడుదల

పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఆరో విడత నిధులు విడుదల

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పేద రైతులకు ఏటా రూ.6వేల ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా(రూ.2వేలు చొప్పున) అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17,100 కోట్లను జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 2018, డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమలవుతుండా, ఆదివారం ఆరో విడత నగదు బదిలీ చేశారు ప్రధాని. కాగా ఈ పథకం కోసం కేంద్రం రూ.75 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story