అమెరికాలో కాల్పుల కలకలం.. 20మంది మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. 20మంది మృతి

అమెరికాలో కాల్పులు కలకలం రేపింది. వాషింగ్టన్‌లో‌ని ఓ పార్టీలో జరిగిన గొడవ కాల్పులుకు దారి తీసింది. ఈ ఘటనలో 20మంది మృతి చెందగా.. ఒక పోలీస్‌కి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయంపై మాట్లాడిన ఓ పోలీస్ అధికారి.. ఈ గొడవ అర్ధరాత్రి 12.30గం.లకు జరిగింది తెలిపారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారని అన్నారు. కనీషం ముగ్గురు కాల్పులుకు దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, రాత్రి జరిగిన ఈ పార్టీకి సుమారు 400 మంది హాజరయ్యారని అన్నారు. కరోనా నేపథ్యంలో 50మందికి మించి ఒక ప్రదేశంలో ఉండకూడదనే నిబంధనలు ఉన్నా.. ఇంత పెద్దగా పార్టీ నిర్వహించడం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయగా.. మరోవైపు కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు పార్టీ నిర్వాహుకులపై కూడా కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story