కరోనా : ఏపీలో కొత్తగా 9,113 మంది డిశ్చార్జ్
ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 58,315
శాంపిల్స్ ని పరీక్షించగా 9,024 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల కొత్తగా అనంతపూర్ లో పదమూడు మంది, చితూర్ లో పన్నెండు మంది, గుంటూరు
లో తొమ్మిది మంది, ప్రకాశం లో ఏడుగురు, విశాఖపట్నం లో ఏడుగురు, కడప లో
ఆరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, పశ్చిమ గోదావరి లో ఆరుగురు, తూర్పు గోదావరి
లో ఐదుగురు,
నెల్లూరు లో ఐదుగురు, విజయనగరం లో ఐదుగురు, కృష్ణ లో ముగ్గురు
,కర్నూల్ లో ముగ్గురు మరణించారు. ఇక గడచిన 24 గంటల్లో 9,113 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,41,654 పాజిటివ్ కేసులకు గాను.. 1,51,854 మంది డిశ్చార్జ్ కాగా.. 2,203 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 87,597 గా ఉంది.
Next Story