ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటలో 57,148 శాంపిల్స్ ని పరీక్షించగా 9,597 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల గుంటూరు లో పదమూడు మంది, ప్రకాశం లో పదకొండు మంది, చితూర్‌ లో పది మంది, నెల్లూరు లో పది మంది, శ్రీకాకుళం లో తొమ్మిది మంది, అనంతపూర్‌ లో ఏడుగురు, కడప లో ఏడుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు,

విజయనగరం లో ఐదుగురు, కర్నూల్‌ లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు మరియు కృష్ణ లో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 6,676 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,51,251 పాజిటివ్ కేసులకు గాను..1,58,530 మంది డిశ్చార్జ్ కాగా.. 2,296 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 90,425 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story