మోదీ సొంతం చేసుకున్న అరుదైన ఘనత

మోదీ సొంతం చేసుకున్న అరుదైన ఘనత

ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఓ అరుదైన ఘనత సాధించారు. కాంగ్రెసేతర ప్రధానుల్లో అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా మోదీ రికార్డు సృష్టించారు. బీజేపీ నుంచి అటర్ బీహార్ వాజ్‌పాయ్ మూడు సార్లు ప్రధాని పదవిని చేపట్టినా.. 2268 రోజులు పదవిలో ఉన్నారు. కాగా.. ఈ రికార్డును ఆయన ఈరోజుతో అధిగమించారు. దీంతో జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోమన్ సింగ్ తరువాత అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డుకెక్కారు. నెహ్రూ 17 ఏళ్లు, ఇందిరాగాంధీ 16 ఏళ్లు, మన్మోహన్ సింగ్ 10 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు. కాగా.. నరేంద్రమోదీ 2014లో, 2019లో రెండు సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Tags

Next Story