కాంగోలో విమాన ప్రమాదం.. ఐదురుగు మృతి

కాంగోలో విమాన ప్రమాదం.. ఐదురుగు మృతి

ఇటీవల విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాంగోలో ఓ కార్గో విమానం కుప్పకూలింది. ప్రమాదంలో ఐదుగురు మరణించారు. చిన్న కార్గో విమానం మినిమియా నుంచి బుకావు వెళ్తుతుండగా దక్షిణ కివూ ప్రావిన్సు పరిధిలోని దట్టమైన అడవుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంపై అమెరికన్ మిషన్ బృందం దర్యాప్తు చేస్తుందని కాంగో మంత్రి తెలిపారు. అయితే, విమాన సర్వీసుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కాంగోలో తరుచూ విమాన ప్రమాదాలకు కారణం. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే కారణంతో యూపర్ లో కాంగో విమాన సర్వీసులు రద్దు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story