ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో అడుగు వేయడానికి సిద్ధం: ప్రధాని మోదీ

ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో అడుగు వేయడానికి సిద్ధం: ప్రధాని మోదీ

దేశ రాజధానిలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో గతంలా కాకుండా ఈ ఏడాది తక్కువమంది అథిదులు మాత్రంమే హాజరయ్యారు. కేవలం 150 మంది వీఐపీలకు మాత్రమే ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించారు. తరువాత ప్రధానిమోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. స్వాతంత్ర్యం కోసం అమరులైన వారందరికీ శ్రద్ధాంజలి ఘటించారు. దేశసరిహద్దులో ఉన్న సైనికులకు.. దేశంలోని పోలీసులకు వందనం చేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో

యుద్దం చేస్తుందని అన్నారు. ఈ మహమ్మారితో జరుగుతున్న యుద్దంలో విజయం సాధించాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.

ప్రస్తుతంలో కరోనాతో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యుల సేవలు మరువలేనివని.. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కరోనాకు తోడు పలు రాష్ట్రాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పరిస్తితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 74 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఎన్నో సాధించాం. ప్రాణ త్యాగం చేసి మన పూర్వీకులు స్వాతంత్ర్యం సాధించారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో అడుగు వేయడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.

Tags

Next Story