ప్రజా ప్రతినిధులు నిత్య ప్రజాసేవకులని.. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్నారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్రావు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మెజారిటీ సీట్లను అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటిని కేసీఆర్ నాయకత్వంలో నెరవేరుస్తామన్న హరీష్.. రోడ్ రోలర్ గుర్తు వల్లే భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్ ఓటమి పాలయ్యారని అన్నారు. మరోసారి ఎంపీగా ఎన్నికైన కొత్త ప్రభాకర్రెడ్డికి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో హరీష్రావు పాల్గొన్నారు.