తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్రావుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. నవీన్రావుతో పాటు గుత్తా సుఖేందర్రెడ్డికి మండలి అవకాశం కల్పిస్తానని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒకటే సీటు కావడంతో నవీన్రావును ఎంపిక చేశారు. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా.. అప్పుడు గుత్తా సుఖేందర్రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారు.