సూర్యాపేట జిల్లా కోదాడలోని ఏపీ-తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ దగ్గర ఓ లారీ దగ్ధమైంది. ఆగి ఉన్న డీజిల్ ట్యాంకర్ ను మరో లారీ ఢీ కొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజన్ రావడం ఆలస్యం కావడంతో మైదా పిండితో సహా లారీ పూర్తిగా కాలిపోయింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.