వైఎస్ జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న జగన్కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని జగన్ను కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతయువతమైన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని లేఖలో పేర్కోన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.