రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ గన్పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్. తెలంగాణ కోసం అమరులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
అనంతరం పబ్లిక్ గార్డెన్ చేరుకున్న కేసీఆర్…అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.