కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది… మేడిగడ్డ నిర్మాణం పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు సీఎం… అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకొని పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు…
అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వరద కాల్వ వద్ద నిర్మిస్తున్న పంప్హౌస్ను పరిశీలించారు సీఎం కేసీఆర్… ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ పంప్హౌస్ మొదటి మోటర్కు ఇటీవల డ్రైరన్ నిర్వహించగా అది విజయవంతం అయింది. ఇక్కడ 8 పంపులలో 4 సిద్ధమయ్యాయి. ఈ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్.. అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మరోమారు డ్రైరన్ నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు.