సీఎం జగన్‌కు తొలిసారి నిరసన సెగ

Update: 2019-06-06 13:37 GMT

ఏపీ సీఎం జగన్‌కు తొలిసారి నిరసన సెగ తాకింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం దాని అనుబంధ విభాగాలపై సీఎం సమీక్ష చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2018 డీఎస్సీ అభ్యర్థులు, ఎ.ఎన్‌.ఎంలు సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు.

Similar News