కథువా రేప్‌ కేసులో పఠాన్‌కోట్‌ కోర్టు తీర్పు..ఆరుగురిని..

Update: 2019-06-10 07:38 GMT

జమ్మూకాశ్మీర్‌లో సంచలనం సృష్టించిన కథువా రేప్‌ కేసులో పంజాబ్‌ పఠాన్‌కోట్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది. త్వరలో నిందితులకు శిక్ష ఖరారు చేయనుంది పఠాన్‌ కోర్టు న్యాయ స్థానం.

జమ్మూకాశ్మీర్‌లో 2018 జనవరిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అభం శుభం తెలియని చిన్నారి అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హతమార్చారు దుండగులు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు ఏడాదిన్నర పాటు విచారించిన కోర్టు.. ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది.

Similar News