'అమ్మఒడి' పథకం ఎవరికి? నెటిజన్స్ కామెంట్స్..

Update: 2019-06-12 04:43 GMT

మీ పిల్లలను బడికి పంపిస్తే చాలు. అలా పంపిస్తే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారవుతారు. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి రూ.15000 ఇస్తామని జగన్ తన మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. జనవరి 26 నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తారు. అయితే ఇప్పుడు అందరిలో నెలకొన్న సమస్య ఏమిటంటే ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకేనా లేక ప్రైవేట్ పాఠశాలల్లో చదివే వారికి కూడా వర్తింపజేస్తారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో నెటిజన్లు ఈ అంశంపై స్పందిస్తున్నారు. ఎక్కువ శాతం మంది ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేయాలని కోరుకుంటున్నారు. తాజాగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమ్మ ఒడికి సంబంధించి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఇది మంచి పథకమని మెచ్చుకుంటూనే నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

Full View

 

 

Similar News