ప్రైవేట్ కాలేజీలో చేర్పించలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్య

Update: 2019-06-14 06:48 GMT

విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్తున్నా.. ఆచరణ అందుకు దూరంగానే ఉంటోంది. విద్యార్థులు సైతం ప్రభుత్వ బడులకు, కాలేజీలకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. అరకొర చదువులు నాకొద్దంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తనను ప్రైవేట్ కాలేజీలో చేర్పించండని.. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను కోరింది. వాళ్లేమో.. మనకు అంత స్తోమత లేదు.. ప్రభుత్వ కాలేజీకే వెళ్లమని సర్దిచెప్పారు. దీంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

Similar News