అనుమానం పెను భూతమైంది. కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. అనుమానంతో 6 నెలల గర్భిణిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన విజయవాడ కృష్ణలంకలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు శైలజ కృష్ణలంకలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ కాగా.. ఆమె భర్త నంబియార్ గుడివాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్నాడు.