చెన్నైలో నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో విశాల్, భాగ్యరాజా టీమ్లు పోటీ పడుతున్నాయి. నడిగర్ సంఘంలో మొత్తం 3 వేల ఒక వంద మంది సభ్యులుగా ఉన్నారు. వివాదాలు.. వాడివేడి విమర్శల నేపథ్యంలో నడిగర్ సంఘం ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. అటు.. మద్రాస్ హైకోర్టు తుదితీర్పు తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు.