రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేకహోదా మాటను నిలబెట్టుకోవాలని వైసీపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన హోదా అంశాన్ని లేవనెత్తారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి కోరారని, ఆనాడు విభజన ప్రక్రియలో ఉన్న.. రాజ్యసభ ఛైర్మన్ ఏపీకి న్యాయం చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు.