సిననటీ విజయనిర్మల మృతికి సంతాపం ప్రకటించారు ఏపీ సీఎం జగన్. ఆమె ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. నానక్రామ్గూడలోని సీనియర్ నటుడు కృష్ణ నివాసానికి చేరుకున్న ఆయన విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. కృష్ణ, నరేశ్లతో పాటు వారి కుటుంబసభ్యులను ఓదార్చారు.. సీఎం జగన్ వెంట వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి. విజయసాయిరెడ్డి ఉన్నారు.