సినీనటి విజయనిర్మల అంత్యక్రియలు ముగిశాయి. చిలుకూరు సమీపంలోని విజయగార్డెన్స్ లో ఆమె భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు నరేష్ చితికి నిప్పంటించారు. విజయనిర్మలను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు తరలొచ్చారు.
అంతకుముందు పలువురు ప్రముఖులు విజయ నిర్మల భౌతికకాయం దగ్గర నివాళులు అర్పించారు. నానక్ రామ్ గూడలోని విజయ ఆమె నివాసానికి వెళ్లిన ఏపీ సీఎం జగన్.. కుటుంబసభ్యులను పరామర్వించారు. కృష్ణ, నరేష్ లను ఓదార్చారు.