తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు మరో అడుగు ముందుకు పడింది. ప్రస్తుత మున్సిపల్ చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆర్డినెన్స్ జారీచేయడంతో పురపాలకశాఖ 138 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డులను ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించినందున వార్డులను హేతుబద్ధీకరించింది. ఇప్పుడు సగటున 1,500 నుంచి 15 వేల జనాభా వరకు ఒక్కో వార్డు ఉండగా దీన్ని పునర్విభజనతో సవరించింది.