తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు

Update: 2019-06-29 04:44 GMT

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు. ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు... ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కూడా నెలకొంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. ఇటు తెలంగాణలోను వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో సూర్యుడు మబ్బుల చాటున దాగుడు మూతలు ఆడుతున్నాడు.

Similar News