ఆలయంలోకి వెళ్లినందుకు జరిమానా..

Update: 2019-07-01 02:40 GMT

దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది.. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఆలయంలోకి వచ్చాడంటూ పెద్దన్న అనే వ్యక్తికి 5వేల రూపాయల జరిమానా విధించారు గ్రామపెద్దలు. అంతే కాదు మళ్లీ గుడిలోకి వస్తే చంపుతామంటూ బెదిరించారు. ఈ ఘటన గ్రామంలో స్వల్ప ఉద్రిక్తతలకు కారణమైంది. దళితసంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పెద్దన్న కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి.

Similar News