తెలుగు రాష్ట్రాల్లో విద్యా కుసుమాలు రాలిపోతున్నాయి.. వేధింపులు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి.. తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో మెడికో బలవన్మరణానికి ప్రయత్నం చేసింది. పౌజ్య అనే విద్యార్థిని తరగతి గదిలోనే బలవన్మరణ ప్రయత్నం చేసింది. హాస్టల్ సిబ్బంది వేధింపులతో ఆమె బలవన్మరణానికి ప్రయత్నించింది. హాస్టల్ సిబ్బంది వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్థాపానికి లోనైందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. హుటాహుటిన పౌజ్యను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది.