కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు తనయుడు రాఘవేంద్ర వైఖరి మరోసారి వివాదాస్పదమైంది. కొంతకాలంగా షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన.. ఏకంగా డీపీఆర్వో ద్వారా మీడియాకు సమాచారం అందించి.. ఎమ్మెల్యే కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టారు. ఎమ్మెల్యే సీటులో కూర్చుని.. అభివృద్ధి అంశాలను వివరించారు. రాఘవేంద్ర వైఖరిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.