భువనగిరి పట్టణంలో మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు భావనను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జగదేవపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. కొద్దిరోజుల కిందట భావన, భానుచందర్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. గత శుక్రవారం బొమ్మలరామారం పీఎస్లో వీరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. భాను చందర్ స్వగ్రామం బీబీ నగర్ మండలం కొండమడుగు కాగా.. భావన స్వస్థలం బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి. భావన కిడ్నాప్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.