సీఎం క్షమాపణలు చెపితే.. జగన్ ప్రవేశ పెట్టిన పథకానికి నేను కూడా ధన్యవాదాలు తెలుపుతా : చంద్రబాబు
అసెంబ్లీలో కరువుపై జరుగుతున్న చర్చలో.. అధికార పార్టీ తీరుపై మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. వెనుక ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ.. బయటకు నీతులు చెప్పడం సరికాదన్నారు. ఒక ఎస్టీ ఎమ్మెల్యేలను రైతు సదస్సుకు రాకుండా అడ్డుకున్నందుకు.. సీఎం క్షమాపణలు చెపితే.. జగన్ ప్రవేశ పెట్టిన పథకానికి తాను కూడా ధన్యాదాలు తెలుపుతానన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వ్యవసాయం అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. లెక్కలు కూడా తెలియకుండా ఆర్థిక మంత్రి ఏం చేస్తారంటూ ప్రశ్నించారు.