బాస్ను ఇంప్రెస్ చెయ్యాలంట.. పోలీసులను ఆశ్రయించిన యాంకర్ శ్వేతా రెడ్డి
బిగ్ బాస్ 3 ప్రారంభానికి ముందే వివాదాలు వెంటాడుతున్నాయి. బిగ్ బాస్ నిర్వహాకులపై చర్యలు తీసుకోవాలి అంటూ.. యాంకర్ శ్వేతా రెడ్డి పోలీసులను ఆశ్రయించారు.. తనను బిగ్ బాస్ 3కి ఎంపిక చేసి.. అగ్రిమెంట్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ 3లో కంటెస్ట్ చేయాలి అంటే బాస్ని ఇంప్రెస్ చేయాలంటూ ఆర్గనైజర్స్ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్బాస్ ప్రోగ్రాం ఇన్ఛార్జ్లు శ్యామ్, రఘులు తనను మోసం చేశారని ఆమె ఆరోపించారు.