కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై శాసన మండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఆ నిర్మాణాలకు ఎవరి పాలనలో అనుమతులు ఇచ్చారో జగన్ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. నాడు వైఎస్ ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. అప్పుడు చట్టాలు గుర్తుకు రాలేదా... ఇప్పుడు గుర్తువచ్చాయా అని మంత్రి బొత్సాను నిలదీశారు యనమల. ఆర్బన్ డెవలప్ యాక్ట్ కింద అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు యనమల.