మధ్యప్రదేశ్లో నీమూచ్లో ఓ యువకుడిపై స్థానికులు దాడి చేశారు. పేరు పొందిన బాద్వా మాత ఆలయంలో మేకలను దొంగతనం చేశాడనే కారణంతో.. యువకున్ని పట్టుకుని చితకబాదారు. ఒళ్లు హూనం అయ్యేలా కొట్టారు.
అంతటితో ఆగని స్థానికులు.. రెచ్చిపోయి బైక్లను తగలబెట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..వారిని చెదరగొట్టి యువకున్ని అదుపులోకి తీసుకున్నారు.