హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. హోటల్లో కూర్చుని సలీమ్ అనే వ్యక్తి టీ తాగుతుండగా.. ఇద్దరు వచ్చి కత్తులతో దాడి చేశారు. వారిని ఇమ్రాన్, ఆమేర్గా గుర్తించారు. పాత కక్షలతో దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన సలీమ్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.