సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో టిక్టాక్ చేయడం హాట్ టాపిక్ అయింది. రోగులు ఛస్తుంటే.. వాళ్లను పట్టించుకోవడం మానేసి.. బిందాస్గా టిక్టాక్ చేసుకోవడం ఏమిటని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ సీరియస్ అయ్యారు. టిక్టాక్ చేసిన ఇద్దరు.. తమ కాలేజీ విద్యార్థులు కాదని ఆయన స్పష్టంచేశారు. ఇంటర్న్షిప్ కోసం గాంధీకి వచ్చారని చెప్పారాయన. వాళ్లిద్దరిపై యాక్షన్ తీసుకున్న సూపరింటెండెంట్.. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఇంచార్జ్కు నోటీసు జారీ చేశారు.