చినజీయర్‌ స్వామి ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్‌

Update: 2019-07-30 15:05 GMT

త్రిదండి చినజీయర్‌ స్వామిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు సీఎం కేసీఆర్‌. శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని జీయర్‌ ఆశ్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్‌ స్వామితో పాటు అహోబిల జీయర్‌ స్వామిల ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్‌. దాదాపు గంట పాటు ఆశ్రమంలో గడిపారు. కేసీఆర్‌కు శాలువ కప్పి మంగళ శాసనాలు అందజేశారు చినజీయర్‌ స్వామి.

Similar News