సుష్మాస్వరాజ్ మరణంపట్ల ఇవాంక ట్రంప్ తీవ్ర సంతాపం

Update: 2019-08-08 14:51 GMT

మాజీ విదేశాంగశాఖ మంత్రి, బీజేపీ నేత సుష్మాస్వరాజ్ అకస్మిక మరణంపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆమెతో తనకు ఉన్న పరిచయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు. ఆమె భారత్ లోని మహిళలకే కాకుండా ప్రపంచంలోని మహిళకు ఛాంపియన్ అంటూ అభివర్ణించారు. భారత్ ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందంటూ విచారం వ్యక్తంచేశారు. ప్రజా సేవలో సుష్మా స్వరాజ్ ఓ లెజెండర్ నిలిచారన్నారు.

Similar News