కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదర్శ్నగర్లో ఆరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్తో 4 తాటాకు ఇళ్లు, రెండు రేకుల షెడ్లు బూడిదయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. బాధితులు సర్వం కోల్పోయామని లబోదిబోమంటున్నారు.