ఆ సమయంలో వెళ్లి సీఎంను కలుస్తాం : నటుడు రాజేంద్రప్రసాద్‌

Update: 2019-08-09 13:09 GMT

సినీ పరిశ్రమకు చెందిన కళాకారులు ముఖ్యమంత్రిని వెంటనే కలవాల్సిన అవసరం ఏమీ లేదని సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన... ఇటీవలే ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు మాత్రమే అవసరాల నిమిత్తం కొత్త సీఎంను వెంటనే కలుస్తారని... కళాకారులకు ఆ అవసరం ఉండదన్నారు. సీఎం ప్రశాంతంగా ఉన్న సమయంలో వెళ్లి కలుస్తామని రాజేంద్రప్రసాద్‌ చెప్పారు.

Similar News