శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఏకంగా 9.2కిలోల బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. వీటి విలువ సుమారుగా.. 3 కోట్ల 46 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ఐరన్ బాక్స్ల్లో గోల్డ్ పెట్టి.. వాటికి వెండి కోటింగ్ వేసి తీసుకువస్తుండగా చాకచక్యంగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.