రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లా టీవీ 5 రిపోర్టర్ తాతాజీ కుటుంబానికి పది లక్షల ఆర్ధిక సాయం అందచేయనున్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య హామీ ఇచ్చారు. సచివాలయంలో ఆయన్ను జర్నలిస్టుల ప్రతినిధుల బృందం కలిసింది. ప్రమాదబీమా పథకం రెన్యూవల్ కానందున తాతాజీ కుటుంబానికి ఎదురైన సమస్యను వివరించింది. ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని కోరారు జర్నలిస్టు సంఘం నేతలు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి నాని..... వెంటనే సీఎం జగన్తో మాట్లాడి ... తాతాజీ కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సహాయం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ప్రమాద బీమా పథకం అమల్లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.