బండి కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. దేశీ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో తాజాగా మరో కొత్త పల్సర్ బైక్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది పల్సర్ 125 నియాన్. ధర వచ్చేసి రూ.64,000 (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) ఉంది. అయితే రెండు వెర్షన్లు ఒకటి డ్రమ్ బ్రేక్ వెర్షన్, రెండు డిస్క్ బ్రేక్ వేరియంట్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. డ్రమ్ బ్రేక్ ధర వచ్చి రూ.64,000, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర వచ్చి రూ.66,618. ప్రీమియం కమ్యూటర్స్ లక్ష్యంగా ఈ బైక్ను లాంచ్ చేసినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. ఆకర్షణీయమైన ధరలో అందరికీ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఫీచర్స్ విషయానికి వస్తే.. 5 స్పీడ్ గేర్ బాక్స్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, నియాన్ యాసెంట్తో కూడిన గ్రాఫిక్ స్కీమ్, కలర్ కోఆర్డినేటెడ్ పల్సర్ లోగో, గ్రాబ్ రెయిల్, రియర్ కౌల్పై 3డీ వేరియంట్ లోగో, బ్లాక్ అలాయ్ మీద నియాన్ కలర్డ్ స్టీక్ వంటివి ఉన్నాయి.