తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది.. కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది.. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్లో పొందుపరిచిన అంశాల్లో వాస్తవం లేదని పేర్కొంది.. అభ్యంతరాలను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.